విరిగిన ఆర్‌‌‌‌‌‌‌‌వోబీ ఐరన్‌‌‌‌ గడ్డర్..గంటల తరబడి నిలిచిన రైళ్ల రాకపోకలు

విరిగిన ఆర్‌‌‌‌‌‌‌‌వోబీ ఐరన్‌‌‌‌ గడ్డర్..గంటల తరబడి నిలిచిన రైళ్ల రాకపోకలు
  • పెద్దపల్లి – కునారం బ్రిడ్జి వద్ద ఘటన

పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి – కునారం మధ్య నిర్మిస్తున్న ఆర్‌‌‌‌వోబీ ఐరన్‌‌‌‌ గడ్డర్‌‌‌‌ శుక్రవారం ఉదయం విరిగిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే... పెద్దపల్లి – కునారం ఆర్‌‌‌‌వోబీ పనుల్లో భాగంగా రెండు వైపులా పిల్లర్లు, స్లాబులు గతంలోనే పూర్తి కాగా.. రైల్వే ట్రాక్‌‌‌‌పై ఐరన్‌‌‌‌తో బ్రిడ్జి నిర్మాణ పనులు ఇటీవలే  మొదలయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం బ్రిడ్జి గడ్డర్‌‌‌‌ సడన్‌‌‌‌గా విరిగిపోవడంతో విద్యుత్‌‌‌‌ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి.

దీంతో బల్లార్హ, ఖాజీపేట వైపు నుంచి వచ్చే రైళ్లను రాఘవాపూర్‌‌‌‌, కొలనూరు, బిజ్‌‌‌‌గిరి షరీఫ్‌‌‌‌, జమ్మికుంట, ఉప్పల్‌‌‌‌, హసన్‌‌‌‌పర్తి రైల్వే స్టేషన్లలోనే ఆపేశారు. గంటల తరబడి రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాత్కాలిక రిపేర్లు పూర్తి చేసిన అనంతరం రైళ్లు యథావిధిగా నడిచాయి. ఉదయం సమయంలో ఘటన జరగడంతో పెనుప్రమాదం తప్పింది.